గోదావరి వరద గురించి ఎవరూ ఆందోళన వద్దు

56చూసినవారు
గోదావరి వరద గురించి ఎవరూ ఆందోళన వద్దు
గోదావరి వరద గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెరవలి మండల ప్రత్యేక అధికారి సునీల్ వినయ్ తెలిపారు. సోమవారం పెరవలి మండలంలోని గోదావరి తీరం వెంబడి వరద పరిస్థితిని పరిశీలించారు. నీరు ఎప్పటికప్పుడు సముద్రంలోకి వెళుతుందన్నారు. లంక భూముల్లోకి రైతులు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలన్నారు. తహశీల్దార్ సుధ, ఎంపీడీవో హిమ మహేశ్వరి, వీఆర్వోలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్