రాజమండ్రిలో ఘనంగా రేలంగి విగ్రహవిష్కరణ

55చూసినవారు
రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేసిన హాస్యనటులు రేలంగి వెంకటరామయ్య విగ్రహాన్ని మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర రంగంలో రేలంగి హాస్యం అజరామరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్