సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యత కల్పించిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి మార్గాని భరత్ అన్నారు. ఆదివారం సాయంత్రం రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ అధ్యక్షతన కాపుల ఆత్మీయ సభ జరిగింది. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కాపు కల్యాణ మండపానికి కృషి చేస్తానన్నారు. రెండేళ్లలోనే నగర స్వరూపాన్ని మారుస్తానన్నారు.