ఈనెల 17న గోపాలపురంలో జాబ్ మేళా

67చూసినవారు
ఈనెల 17న గోపాలపురంలో జాబ్ మేళా
తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజమండ్రిలో ఆయన ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఎంసీఏ, ఉత్తీర్ణులు జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. సంబంధిత వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్