కిర్లంపూడి మండలంలో ఘనంగా పల్లెకు పోదాం కార్యక్రమం

571చూసినవారు
కిర్లంపూడి మండలంలో ఘనంగా పల్లెకు పోదాం కార్యక్రమం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమం శనివారం మండల అధ్యక్షులు యడాలి రాంబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలంలోని రాజుపాలెం గ్రామాల్లో పల్లెకి పోదాం కార్యక్రమం జయప్రదంగా జరిగింది. జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణ వర్మ మాట్లాడుతూ జాతీయ స్థాయి నుంచి పల్లె స్థాయి వరకూ కేంద్ర పధకాలు, బీజేపీ పార్టీ విధివిధానాలు పల్లె ప్రజలకు వివరించడమే పల్లెకు పోదాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

సంబంధిత పోస్ట్