ఓఎన్జీసీ సహకారం అవసరం: కలెక్టర్

50చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులను సమకూర్చి సహకారం అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలతో కలిసి ఓఎన్జీసీ ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి ఓఎన్జీసీ సహకారంపై కలెక్టర్ చర్చించారు.