గీతాంజలి మృతికి సంతాపంగా ఇంద్రపాలెం గ్రామంలో గురువారం రాత్రి కాకినాడ రూరల్ ఎఎంసి చైర్మెన్ గీసాల శ్రీను కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గీతాంజలి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని మహిళలు, గ్రామ పెద్దలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షులు పలివెల శ్రీను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సూరంపూడి మాధవ, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.