వాడపల్లికి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు

2231చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. ఏడు శనివారాల స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కన్నులారా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్