అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

64చూసినవారు
అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాపచింతలపూడి గ్రామానికి చెందిన మహిళ బయ్యవరపు నాగసాయి (56) మృతదేహం గౌతమీ గోదావరిలో శనివారం కనిపించింది. ఆమె ఈ నెల 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాలింపు చేపట్టగా కర్రివాని రేవు పెన్నాడవారిపాలెం సమీపంలో గోదావరిలో మృతదేహం కనిపించింది. పోలీసులు శవ పంచనామాకోసం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.