ముమ్మిడివరం: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

83చూసినవారు
ముమ్మిడివరం: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకకు చెందిన సుందరపల్లి నాగ వెంకట శేషాద్రి (50) శుక్రవారం తన ఇంటిలో రిఫ్రిజిరేటర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ముమ్మిడివరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జ్వాలా సాగర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్