ఎన్నికల ప్రచారంలో అపూర్వ స్పందన: ఎమ్మెల్యే అభ్యర్థి కందుల

50చూసినవారు
తూ. గో జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టినప్పటి నుంచి ప్రజల ద్వారా అపూర్వ స్పందన లభిస్తుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం నిడదవోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నిడదవోలు అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో సమస్యలు తెలుసుకున్నానని గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్