సీఎం జగన్ సారధ్యంలో బీసీలకు పెద్ద పీట వేయడం జరిగిందని రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి, ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజమండ్రిలోని 13వ వార్డులో నిర్వహించిన శెట్టిబలిజ, గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలను చట్టసభలకు పంపించిన ఘనత జగన్ కే చెందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.