May 07, 2024, 15:05 IST/గద్వాల్
గద్వాల్
బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు: జడ్పీ చైర్మన్ సరిత
May 07, 2024, 15:05 IST
బీజేపీ, బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. మంగళవారం కేటి దొడ్డి మండలంలోని నందిన్నె, కేటిదొడ్డి, కోండపురం, మైలగడ్డ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలను కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.