తూ. గో జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద వినాయక చవితి వేడుకలు

73చూసినవారు
వినాయక చవితి సందర్భంగా శనివారం రాజమండ్రిలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ అధ్యక్షులు బొమ్మలు దత్తు ఆధ్వర్యంలో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీదేవి, యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్