వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. రూరల్ నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపే ఉన్నారని అన్నారు.