సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

85చూసినవారు
రాజవొమ్మంగి మండలం లబ్బర్తి, దూసరిపాము, రాజవొమ్మంగి గ్రామాల్లో సోమవారం రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పెన్షన్ లు పంపిణీ చేశారు. పెరిగిన పెన్షన్ లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి పెన్షన్ పంపిణీ చేసారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్