సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది ఫిషింగ్ హార్బర్ లో భారీ టేకు చేపలు కనువిందు చేశాయి. మరో 10 రోజుల్లో చేపల వేట నిషేధం అమలు కానున్న నేపథ్యంలో జాలర్లకు పంతాల టేకు చేపలు వలకు చిక్కాయి. వీటిని హార్బర్లో వేలం వేయగా స్థానిక వ్యాపారి రూ. 15 వేలకు కొనుగోలు చేసినట్లు స్థానిక మత్స్యకారులు శనివారం తెలిపారు.