చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని సీఎం జగన్ అన్నారు. "చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు చేసిన ఒక్క మంచి కూడా లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీస్సులు కోరుతున్నా." అని సీఎం పేర్కొన్నారు.