చింతమనేనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

80చూసినవారు
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్తలను దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని అలజడి సృష్టిస్తూ నాశనం చేస్తున్నారని చింతమనేని పై ఆయన మండిపడ్డారు. ఎప్పుడైతే బీఫామ్ అందుకున్నావో అప్పటినుండి నియోజకవర్గంలో ఎక్కడో చోట నిత్యం గొడవలు అవుతున్నాయని అన్నారు.

ట్యాగ్స్ :