వరద బాధితులకు సరుకులు పంపిణీ

53చూసినవారు
మండలంలోని పులపర్రు శివారు కాకతీయ నగరులో సీఐటియూ ఆధ్వర్యంలో వంద మంది వరద బాధితులకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ చేతుల మీదుగా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కే. విజయలక్ష్మి, ఎన్. నాగలక్ష్మి, ప్రాజెక్టు లీడర్ చెల్లమ్మ, గన్నవరం సెక్టార్ లీడర్ జీ. విజయలక్ష్మి, యూనియన్ లీడర్ శివ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్