మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
మచిలీపట్నంలో మైనర్ బాలికను పాశవికంగా బహిరంగ ప్రదేశంలో దుండగుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాల్ నగర్ కు చెందిన పి. పవన్ కుమార్ ఖాళీగా ఉంటూ గంజాయికి బానిస అయ్యాడు. గుమస్తాల కాలనీకి చెందిన ఓ మైనర్ బాలిక శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బలవంతంగా తీసుకెళ్లి తుమ్మ చెట్ల చాటున పాశవికంగా అత్యాచారం చేసాడు. బాలిక పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.