పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల వ్యాప్తంగా గురువారం ఉదయం తెల్లవారుజామునండి భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాతావరణం లోని మార్పుల కారణంగా వర్షం కురవడంతో స్కూలుకు వెళ్లేందుకు స్కూల్ పిల్లలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు పాలు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు సైతం ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నారుమడులు వేసిన రైతులు వర్షంతో నారుమడులు మునిగిపోతాయేమోనని ఆందోళనలో ఉన్నారు.