పాలకొల్లు: మహిషాసురమర్ధని దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

57చూసినవారు
పాలకొల్లు: మహిషాసురమర్ధని దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని మహిషాసురమర్ధని దేవి అవతారంలో అలంకరించారు. మహిషాసురుడుని సంహరిస్తూ ఉన్నట్లుగా చేసిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్