విజయవాడలోని APCRDA కార్యాలయం ఎదుట అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో రైతులు CRDA కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు గేట్లు వేశారు. అసైన్డ్ రైతులు, భూమి లేని కూలీలను ఆదుకోవాలని, వెంటనే వార్షిక కౌలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో పాటు సీపీఐ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని రైతులు మండిపడుతున్నారు.