నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరానిగుండ్ల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోరు వర్షంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు యువకులని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. మృతులు ముని, ప్రభాకర్లను కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా, దశరథను డోన్ మండలం చనుగొండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు.