ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ (వీడియో)

60చూసినవారు
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తుగానే తరలించినట్లు సమాచారం. అధికారులు ప్రకాశం బ్యారేజీకి 70 గేట్లను ఎత్తివేసి సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,06,990 క్యూసెక్కులుగా ఉంది.

సంబంధిత పోస్ట్