VIDEO: రీల్స్ చేస్తూ కొండపై నుంచి పడిపోయిన మహిళ

69చూసినవారు
ఉత్తరాఖండ్‌లో శనివారం ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రీల్స్ చేస్తూ ఎత్తైన కొండపై నుంచి కింద పడింది. ముజఫర్‌నగర్‌కు చెందిన రేషు (28) హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం కొండపై రీల్స్‌ చేస్తుండగా జారి 70 అడుగుల లోతైన లోయలో పడ్డారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్