పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం

57చూసినవారు
పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం
AP: తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల విహారయాత్ర మొదలైంది. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి 41 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బందితో బోటు విహారయాత్రకు బయలుదేరింది. పోలీసులు పర్యాటకుల బ్యాగులను తనిఖీ చేసి.. అనంతరం పర్యటనకు అనుమతించారు. ఈ క్రమంలో దేవీపట్నం ఎస్సై షరీఫ్ పర్యాటకులకు పలు సూచనలు చేశారు. కాగా, గోదావరి వరదల కారణంగా.. జూలైలో పాపికొండల టూర్‌ను అధికారులు ఆపేశారు.

సంబంధిత పోస్ట్