డయేరియాతో ఐదుగురు మృతి.. సీఎం చంద్రబాబు ఆరా

50చూసినవారు
డయేరియాతో ఐదుగురు మృతి.. సీఎం చంద్రబాబు ఆరా
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో 2 రోజుల్లోనే ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. గ్రామంలో డయేరియా బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్