గుంటూరు రైల్వే స్టేషన్ ఆవరణలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 40 సంవత్సరాలు ఉండొచ్చని, అనారోగ్య కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.