140 కుటుంబాలు నివసించే మారుమూల పల్లెలో 50 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

79చూసినవారు
140 కుటుంబాలు నివసించే మారుమూల పల్లెలో 50 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక
140 ఇళ్లు, 575 మంది జనాభా కలిగిన మంచిర్యాల జిల్లా లంబాడి తండా(కె)లో 50 మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ గ్రామం గుడుంబాకు అడ్డాగా ఉండేది. తొలుత రాజుబాయి అనే మహిళ తన ఆరుగురు పిల్లలనూ చదివించగా, వారిలో ముగ్గురు కొలువులు సాధించారు. రాజబాయిని చూసి మరికొందరు తల్లులూ స్పూర్తి పొంది, తమ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించడంతో ఇప్పుడా గ్రామం కొలువుల గడ్డగా పేరుపొందింది.

సంబంధిత పోస్ట్