ఏపీలో వరద నష్టం వివరాలు ఇలా..

50చూసినవారు
ఏపీలో వరద నష్టం వివరాలు ఇలా..
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 1,15,151 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ప్రకారం.. 1,86,576 మంది రైతులకు రూ.278.49 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. 1,12,721 కోళ్లు, 564 పాలిచ్చే పశువులు, 719 మేకలు, గొర్రెలు, 207 ఇతర పశువులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీటికి పరిహారంగా రూ.3.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్