కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య

84చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చక్కా రాజేష్ గత కొన్ని సంవత్సరాలుగా పొన్నూరు రామమందిరం వద్ద సెలూన్ నిర్వహిస్తున్నాడు. స్థానిక యువతి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కాపురం బాగానే సాగిన ఇటీవల కుటుంబ కలహాలు చెలరేగాయి. భార్య కేసు పెట్టడంతో మనస్తాపం చెంది మంగళవారం తెల్లవారుజామున సాగర్ పెద్ద కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్