92 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

76చూసినవారు
92 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామ సమీపాన బాలాజీ ఫౌండరీ కర్మగారంలో సోమవారం తెల్లవారుజామున గుంటూరు విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి 92 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమాని సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రతిపాడు మండలంలో రేషన్ మాఫియా కొనసాగడంతో దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్