హైదరాబాద్ లో రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి పడి 62 ఏళ్ల వ్యక్తి మృతి

1040చూసినవారు
హైదరాబాద్ లో రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి పడి 62 ఏళ్ల వ్యక్తి మృతి
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 62 ఏళ్ల అబ్దుల్ సలాం అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అబ్దుల్ సలాం గాల్లోకి ఎగిరి దాదాపు 20 అడుగుల దూరంలో పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో సలాం అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో బైకర్ సాయి కిరణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్