గడ్డి మoదు తాగి వ్యవసాయ కూలీ మృతి

81చూసినవారు
గడ్డి మoదు తాగి వ్యవసాయ కూలీ మృతి
ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామానికి చెందిన కొమ్మిశెట్టి శివయ్య (58) వ్యవసాయ కూలీ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మూర్చ వ్యాధి బారిన పడ్డాడు. దీంతో జీవితం పై విరక్తి చెంది సోమవారం గడ్డి మందు తాగాడు. బంధువులు హుటాహుటిన గుంటూరు జి జి హెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ శివయ్య మృతి చెందాడు. భార్య శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్