గారపాడులో పర్యటించిన ఎమ్మెల్యే బూర్ల, ఎస్పీ, ఆర్డిఓ

61చూసినవారు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలో గత బుధవారం వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య జరిగిన గొడవలను విచారించేందుకు గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లాఎస్పీ తూషార్ డూడి, ఆర్డీవో శ్రీకర్ గ్రామంలో పర్యటించారు. గొడవలకు కారణం తగు వివరాలను ఆయా పార్టీల వర్గీయుల నుండి సమాచారం సేకరించారు. గ్రామంలో గొడవలు లేకుండా సామరస్యంగా ప్రజలు కలిసి మెలిసి ఉండాలని వారు సూచించారు. దోషులకు శిక్ష తప్పదన్నారు.

సంబంధిత పోస్ట్