కోరిశపాడులో వ్యక్తిని బెదిరించి రూ. 39 లక్షలు స్వాహ

68చూసినవారు
కోరిశపాడులో వ్యక్తిని బెదిరించి రూ. 39 లక్షలు స్వాహ
కొరిశపాడు మండలం పి. గుడిపాడు గ్రామం జాతీయ రహదారి పై ఓ వ్యక్తిని బెదిరించి నగదును దోచుకెళ్లిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన పల్లం స్వరూప్, బంగారం కొనుగోలు నిమిత్తం చెన్నై బయల్దేరాడు. కొందరు వ్యక్తులు కారులో పథకం ప్రకారం అతడిని వెంబడించి గుడిపాడు జాతీయ రహదారి వద్దకు చేరుకోగానే బెదిరించి రూ. 39. 50 లక్షల నగదును అపహరించారు. బాధితుడు మేదరమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్