చీరాల: ఏరియా వైద్యశాల సందర్శించిన కేంద్ర బృందం

71చూసినవారు
చీరాల: ఏరియా వైద్యశాల సందర్శించిన కేంద్ర బృందం
చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలను బుధవారం కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. హాస్పిటల్ లోని వసతులు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వివిధ పరీక్షల పరికరాలను వారు పరిశీలించారు. ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఏమేమి అవసరమో వారు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తమను పంపినట్లు బృందం సభ్యులు చెప్పారు. తమ నివేదికను కేంద్రానికి సమర్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్