గుంటూరు: 20 నుంచి కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం

56చూసినవారు
గుంటూరు: 20 నుంచి కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో గుంటూరు కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కార్యక్రమంలో కాశ్మీర్లోని 6 జిల్లాల నుంచి 132 మంది యువత పాల్గొంటారన్నారు. వీరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బస ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్