బొల్లా సమక్షంలో వైసీపీలోకి చేరిక
ఈపూరు మండలం ముప్పాళ్ళ నుంచి పలు కుటుంబాలు శనివారం టీడీపీని వీడి వైసీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైసీపీ కుటుంబంలోని సభ్యులని పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.