యరపతినేని సమక్షంలో టీడీపీలోకి చేరికలు
మాచవరం ఎస్సీ కాలనీకి చెందిన పలు కుటుంబాలవారు శనివారం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ అరాచక పాలన అంతముందించి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని తాము టీడీపీలో చేరామన్నారు. ఎడ్లపల్లి రామారావు, శవిరి బాబు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.