కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు డైట్ కళాశాలలో లెక్చరర్ హరికిరణ్ను ఓ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్లు పంపిన కారణంగా సస్పెండ్ చేశారు. విద్యార్థిని 20 రోజులుగా అతని వేధింపులకు గురవుతున్నట్లు తోటి విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డీఈవో.. డైట్ కళాశాల లెక్చరర్ హరికిరణ్పై చర్యలు తీసుకొని, సస్పెన్షన్ విధించారు.