టిడిపి- జనసేన కూటమిని ఆదరించాలి: యరపతినేని
రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలు అందరూ టిడిపి- జనసేన కూటమికి మద్దతు పలకాలని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచవరం మండలంలోని గంగవరం గ్రామంలో గురువారం రాత్రి బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో యరపతినేని పాల్గొన్నారు. గ్రామంలోని టిడిపి, జనసేన శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా చర్చిలో యరపతినేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.