ఎన్ఎంఎంఎస్ ఫీజు గడువు పొడిగింపు

73చూసినవారు
ఎన్ఎంఎంఎస్ ఫీజు గడువు పొడిగింపు
ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ఆన్ లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24వ తేదీ వరకు గడువు పొడిగించామని గురువారం పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటేశ్వర్లు నరసరావుపేటలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఒరిజినల్ ఎస్బీఐ కలెక్ట్ రసీదును ఈనెల 27లోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్