నరసరావుపేట: రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి: జేసీ

74చూసినవారు
నరసరావుపేట: రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి: జేసీ
పప్పు శనగ కొనుగోలు కోసం రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరె సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్లో రైతులు 20వేల హెక్టార్లలో శనగ పంటలు వేశారన్నారు. దీని ద్వారా 16,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. క్వింటాలకు కనీసం మద్దతు ధర రూ. 5,650గా నిర్ణయించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్