పెదకూరపాడు లోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం గ్రామానికి చెందిన చిమట శ్రీను అమరావతి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో శ్రీను మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.