బెంగళూరులోని రామేశ్
వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఓ టెక్కీ తన అనుభవాన్ని పంచుకున్నారు. 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ అలంకృత్ పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్నాడు. అయితే బాంబు పేలడానికి ముందే అతడికి తల్లి ను
ంచి ఫోన్ వచ్చింది. దాంతో అమ్మతో మాట్లాడేందుకు కేఫ్ నుంచి 10 మీటర్ల దూరం వెళ్లానని తెలిపాడు. తన తల్లి ఫోన్ కాల్ వల్లనే తాను ప్రాణాలతో బయ
టపడ్డానని కుమార్ చెప్పాడు.