
75 త్యాళ్ళూరు హైస్కూల్ కు సౌండ్ సిస్టమ్ వితరణ
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్ అభివృద్ధికి ఎం.ఎల్.టి ఫౌండేషన్ పదివేల రూపాయల విలువ చేసే సౌండ్ సిస్టమ్ ను సోమవారం పాఠశాలకు అందజేశారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తమ సహాకారం ఉంటుందని ఫౌండేషన్ వారు అన్నారు. దీనిలో ఫౌండేషన్ కు చెందిన మల్లవరపు ఆరోగ్యయ్య, కె. జయరాజ్, హెచ్ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, పీసి చైర్మన్ పున్నారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.