ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే బూర్ల

82చూసినవారు
కాకుమాను గ్రామం ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం కాకుమాను పర్యటన సందర్భంగా ఎంపీపీ పాఠశాలను ఆయన సందర్శించారు. రిజిస్టర్ లో 20 మంది విద్యార్థులు ఉండగా 5 మంది హాజరవ్వడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పటంతో ఆగ్రహం వ్యక్తం చేసి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్